నిత్యావసర కూరగాయల్లో ముఖ్యమైన (Onion ) ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తోడు ఉల్లి ధర కూడా భగ్గుమంటుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిపాయను కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్లోని పలు రిటైల్ మార్కెట్లు, కూరగాయల దుకాణాల్లో మంచి నాణ్యత గల (Onion) ఉల్లిపాయలు ప్రస్తుతం కిలో రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కొంతకాలం క్రితం తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు కిలోకు రూ.70కి పైగా చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.

ఉల్లి సాగు ప్రాంతాల నుంచి మార్కెట్లకు సరుకు రాక తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపారులు పేర్కొంటున్నారు. వర్షాలు, రవాణా సమస్యలు వంటి కారణాలతో సరఫరా వ్యవస్థకు అంతరాయం ఏర్పడటంతో మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉల్లి అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు.
![]()
ముందుగా హోల్సేల్ మార్కెట్లలో ధరలు పెరగగా.. దాని ప్రభావం రిటైల్ మార్కెట్లపై పడిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఉల్లి ధరలు సమీప కాలంలో తగ్గుతాయా లేదా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న చర్చ కూడా మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
Also read:
