భారత (Stock Market) స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్ను ముగించాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు ఆర్థిక రంగంలో నెలకొన్న ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. దీంతో ప్రధాన సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 సూచీ 65.35 పాయింట్లు నష్టపోయి 24,570.65 వద్ద స్థిరపడింది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 455.59 పాయింట్లు పడిపోయి 78,499.17 వద్ద ముగిసింది. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో కనిపించింది.
అంతర్జాతీయంగా హార్ముజ్ జలసంధి ద్వారా సాధారణ రవాణా పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడం ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసింది. కీలకమైన ఈ జలమార్గంలో శాశ్వత ఒప్పందం కుదరకపోవడంతో క్రూడ్ ఆయిల్ సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ధర 1.4 శాతం పెరిగి బ్యారెల్కు 83.65 డాలర్లకు చేరింది.
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన కొన్ని నిబంధనలపై ఆర్థిక రంగంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందించే కొన్ని రివాల్వింగ్ క్రెడిట్ ఉత్పత్తులపై పరిమితులకు సంబంధించిన ప్రతిపాదనలు మార్కెట్పై ప్రభావం చూపాయి.
దీంతో బజాజ్ ఫైనాన్స్ (Stock Market) షేరు ఏకంగా 3.9 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ షేరు 3.3 శాతం పడిపోయాయి. ఫలితంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ సూచీ కూడా నష్టాలను చవిచూసింది. నిఫ్టీ బ్యాంక్ 0.2 శాతం, ప్రైవేట్ బ్యాంక్ సూచీ 0.51 శాతం, పీఎస్యూ బ్యాంక్ సూచీ 0.21 శాతం క్షీణించాయి.
అయితే ఆటో, ఐటీ, మెటల్ రంగాల షేర్లు మాత్రం లాభాలతో ముగిశాయి. రూపాయి విలువలో పెద్దగా మార్పు కనిపించలేదు. గురువారం డాలర్తో పోలిస్తే రూ.95.22గా ఉన్న రూపాయి విలువ శుక్రవారం రూ.95.21 వద్ద ముగిసింది.
మొత్తంగా చూస్తే.. అంతర్జాతీయ ఇంధన పరిస్థితులు, ఆర్బీఐ ప్రతిపాదనలు, రంగాల వారీగా అమ్మకాల ఒత్తిడి భారత మార్కెట్లను శుక్రవారం నష్టాల్లోకి నెట్టాయి.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన, సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది పెట్టుబడి సలహా కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు SEBI-రిజిస్టర్డ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
Also read:
