గ్లోబల్ స్టార్ Ram Charan నటించిన (Peddi )పెద్ది సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రానికి టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అభిమానులు తొలి రోజు నుంచే ప్రత్యేక షోలు, ప్రీమియర్ ప్రదర్శనలను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.
ప్రభుత్వ అనుమతితో సినిమా ప్రదర్శనల కోసం రోజుకు ఐదు షోలకు అనుమతి లభించింది. అంతేకాకుండా విడుదల సందర్భంగా ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల తొలి రోజు నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొనే అవకాశం ఉంది.
టికెట్ ధరల విషయానికి వస్తే, ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధర)పై రూ.100 వరకు పెంపు ఉండనుండగా, మల్టీప్లెక్స్లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేయనున్నారు. ఈ పెరిగిన ధరలు సినిమా విడుదలైన తర్వాత 10 రోజుల వరకు అమల్లో ఉండనున్నాయి.
(Peddi) పెద్ద సినిమాల విడుదల సమయంలో ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపు తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా కనిపించే అంశమే. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలకు భారీ డిమాండ్ ఉండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. దీంతో తొలి వారంలోనే అధిక వసూళ్లు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఇక పెద్ది సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సినిమా ట్రైలర్, పోస్టర్లు, ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. టికెట్ ధరల పెంపుకు అనుమతి రావడంతో ఓపెనింగ్ కలెక్షన్లపై మరింత ఆసక్తి పెరిగింది. విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.
Also read:
