Giorgia Meloni మరియు Narendra Modi పేర్ల కలయికతో ఏర్పడిన “మెలోడీ”(Melody) ట్రెండ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటలీ ప్రధాని మెలోనీ ఇన్స్టాగ్రామ్లో ఈ ట్రెండ్కు సంబంధించిన వీడియోలు భారీ వ్యూస్ సాధిస్తున్నాయి.(Melody)
ఇటీవల రోమ్లో జరిగిన సమావేశాలు, కొలోసియం సందర్శన మరియు ప్రత్యేక డిన్నర్ డిప్లొమసీ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలు మరింత బలపడుతున్నాయని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా “చాక్లెట్ డిప్లొమసీ” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సరదా పోస్టులు చేస్తున్నారు.
2023లో విడుదలైన “Hello from the Melody team” వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వీడియోకు దాదాపు 6.7 కోట్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. అలాగే జీ20 సమ్మిట్ సందర్భంగా వచ్చిన “మెలోడీ” గ్రీటింగ్ వీడియో కూడా 2.3 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.

ప్రస్తుతం “మెలోడీ మూవ్మెంట్” పేరుతో సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటలీ ప్రధాని మెలోనీ ఇన్స్టాగ్రామ్లోని వీడియోలకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఒక వీడియోకు 99 లక్షలకుపైగా వ్యూస్ రావడంతో ఈ ట్రెండ్ మళ్లీ హాట్ టాపిక్గా మారింది.
ఇక బాలీవుడ్ జంట Sonakshi Sinha మరియు Zaheer Iqbal కూడా ఈ ట్రెండ్లో చేరారు. ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
“నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తావో తెలుసా?” అని జహీర్ అడగగా, “తెలీదు” అని సోనాక్షి సమాధానం చెప్పింది. వెంటనే మెలోడీ చాక్లెట్ తీసి “మెలోడీ ఖావో.. ఖుద్ జాన్ జావో” అని చెప్పడంతో వీడియో వైరల్ అయింది.
ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ రావడంతో పాటు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. “మెలోడీ డిప్లొమసీ నుంచి మెలోడీ లవ్ స్టోరీ వరకు” అంటూ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం “మెలోడీ” సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ టాపిక్గా మారింది.
Also Read:
