స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని కొనసాగిస్తోంది. 444 రోజుల గడువుతో అందిస్తున్న అమృత్ వృష్టి FD స్కీమ్ ప్రస్తుతం సాధారణ FDల కంటే కొంత ఎక్కువ వడ్డీ రేటును అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గింపుల తర్వాత అనేక బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించినప్పటికీ, ఈ ప్రత్యేక పథకం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం సాధారణ ఖాతాదారులకు ఈ పథకంపై 6.45% వడ్డీ, సీనియర్ సిటిజెన్లకు 6.95% వడ్డీ లభిస్తోంది. గతంలో ఈ రేట్లు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇది (SBI) లోని ఆకర్షణీయమైన టర్మ్ డిపాజిట్ ఆప్షన్లలో ఒకటిగా భావిస్తున్నారు.
ఒకవేళ సాధారణ ఖాతాదారు రూ.2 లక్షలు ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే, నెలవారీ వడ్డీ ఎంపికలో సుమారు రూ.1,075 చొప్పున పొందవచ్చు. 444 రోజుల గడువు పూర్తయ్యే సమయానికి మొత్తం వడ్డీ సుమారు రూ.15,050 వరకు చేరుతుంది. త్రైమాసిక చెల్లింపు ఎంపికను ఎంచుకుంటే ప్రతి మూడు నెలలకు సుమారు రూ.3,225 చొప్పున వడ్డీ లభిస్తుంది.
మరోవైపు గడువు ముగిసే వరకు వడ్డీని తీసుకోకుండా ఉంచితే, చక్రవడ్డీ ప్రయోజనంతో సుమారు రూ.16,220 వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది.
సీనియర్ సిటిజెన్లకు ఈ స్కీమ్ మరింత లాభదాయకంగా ఉంటుంది. రూ.2 లక్షల డిపాజిట్పై నెలకు సుమారు రూ.1,158 వడ్డీ వస్తుంది. 444 రోజుల కాలానికి మొత్తం వడ్డీ రూ.16,217 వరకు ఉండవచ్చు. గడువు చివర్లో మొత్తం తీసుకునే ఎంపికను ఎంచుకుంటే, చక్రవడ్డీతో కలిపి సుమారు రూ.17,520 వరకు రాబడి లభించవచ్చు.
భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం కోరుకునే పెట్టుబడిదారులకు SBI అమృత్ వృష్టి FD మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, నెలవారీ వడ్డీ ద్వారా అదనపు ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది.
Also read:
