భారత క్రికెట్(Cricket) లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజాలు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప బ్యాటర్ అనే చర్చ మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. తరాలు వేరు కాబట్టి ఇద్దరినీ పోల్చడం సరికాదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుంటారు. కానీ దక్షిణాఫ్రికా మాజీ (Cricket) క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాత్రం ఈ ప్రశ్నకు తనదైన శైలిలో స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.

సచిన్ టెండూల్కర్తో పోలిస్తే విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడిగా తాను భావిస్తున్నట్లు డివిలియర్స్ వెల్లడించాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో విదేశీ గడ్డపై కోహ్లీ ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించాడు. విదేశీ పరిస్థితుల్లో భారత బ్యాటింగ్కు కోహ్లీ కొత్త ప్రమాణాలను నెలకొల్పాడని, అతని ఆటతీరు ఇతర భారత బ్యాటర్లకు కూడా స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నాడు.
డివిలియర్స్ ప్రకారం.. విదేశాల్లో సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఒక అద్భుతమైన ప్రమాణాన్ని ఏర్పాటు చేశాడు. అయితే కోహ్లీ ఆ స్థాయిని మరింత ముందుకు తీసుకెళ్లాడని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా బౌన్సీ, సీమింగ్ పరిస్థితుల్లో పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడని చెప్పాడు.

టెస్ట్ క్రికెట్లో సచిన్ 15,921 పరుగులతో పాటు 51 సెంచరీలు సాధించాడు. విదేశీ గడ్డపై కూడా అతని రికార్డు అద్భుతంగానే ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ టెస్ట్ల్లో 9,000కు పైగా పరుగులు సాధించి భారత క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. విదేశాల్లో కూడా కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ జట్టుకు విజయాలను అందించాడు.
సచిన్ విదేశీ పరిస్థితుల్లో రాణించగల భారత బ్యాటర్గా ఒక కొత్త దారిని చూపించాడని డివిలియర్స్ పేర్కొన్నాడు. అయితే ఆ వారసత్వాన్ని కోహ్లీ మరో స్థాయికి తీసుకెళ్లాడని చెప్పాడు. ఈ కారణంగానే ఇద్దరిలో కోహ్లీకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు.
కేఎల్ రాహుల్కు ఏబీడీ కీలక సూచనలు
ఇదే సందర్భంగా కేఎల్ రాహుల్ ఆటతీరుపై కూడా ఏబీ డివిలియర్స్ స్పందించాడు. రాహుల్కు మంచి బ్యాటింగ్ టెక్నిక్ ఉందని, అతను భారత జట్టుకు ఎంతో విలువైన ఆటగాడని ప్రశంసించాడు. అయితే విదేశీ గడ్డపై తన ప్రారంభాలను భారీ స్కోర్లుగా మార్చుకోవడంలో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని సూచించాడు.
క్రీజులో కుదురుకున్న తర్వాత రాహుల్ భారీ ఇన్నింగ్స్లు ఆడాలని, కేవలం సెంచరీలకే పరిమితం కాకుండా డబుల్ సెంచరీల దిశగా ఆలోచించాలని డివిలియర్స్ సూచించాడు. కొత్త బంతి ఎప్పుడైనా వికెట్ తీసే అవకాశం ఉన్నందున మంచి ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మలచడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.
మొత్తంగా సచిన్, కోహ్లీ పోలికపై ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో మరోసారి చర్చకు తెరలేపాయి. సచిన్ తన తరంలో చరిత్ర సృష్టించగా.. కోహ్లీ విదేశీ పరిస్థితుల్లో భారత బ్యాటింగ్కు కొత్త ప్రమాణాలను తీసుకొచ్చాడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
Also read:
